Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ రోడ్డు ప్రమాదం... మృతిచెందిన నలుగురు చిన్నారుల వివరాలివే

క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగి లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

road accident at kurnool... 4 childs death
Author
Kurnool, First Published Dec 15, 2020, 11:02 AM IST

కర్నూలు: జిల్లాలోని సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎం వాహనం ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10)గా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  కర్నూలు-వైఎస్సార్‌ కడప జాతీయ రహదారిపై  ఈ దారుణం చోటుచేసుకుంది. 

క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగి లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా స్థానిక ఎర్రగుంట్ల గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో రహదారిపైన 40 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు చేజ్ చేసి మరి బత్తులూరు వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios