శ్రీకాకుళం జిల్లాలో ఘోరం... ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా... 30మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగాం మండలం సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 62మంది వుండగా 30మందికి గాయపడ్డారు. ఇలా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గాయపడిన క్షతగాత్రులను పలాసలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. బెంగళూరు నుండి కలకత్తా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు అధిక వేగంతో వెళుతుండగా అదుపుచేయడంలో డ్రైవర్ విఫలమవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.