దువ్వాడ రైల్వే స్టేషన్లో ట్రైన్-ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్న యువతి.. గంట పాటు నరకయాతన..
విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ యువతి ట్రైన్కు, ప్లాట్ఫామ్కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది.
విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ దిగుతున్న సమయంలో ఓ యువతి జారిపడింది. దీంతో ట్రైన్కు, ప్లాట్ఫామ్కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది. వివరాలు.. అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజ్లో చదువుకుంటుంది. కాలేజ్ వెళ్లేందుకు శశికళ గుంటూరు-రాయగడ రైలులో దువ్వాడకు చేరుకుంది. అయితే రైలు దిగుతున్న సమయంలో ఆమె ప్లాట్ఫామ్-ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఇది గమనించిన రైల్వే పోలీసులు, సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును నిలిపివేశారు. అతి కష్టం మీద రైల్వే సిబ్బంది యువతిని బయటకు తీశారు. అయితే ఈ సమయంలో యువతి తీవ్ర నరకయాతన అనుభవించింది. ఆమెను బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరిలించారు. అయితే యువతి ట్రైన్ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో రన్నింగ్లో ఉండగానే దిగేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.