Asianet News TeluguAsianet News Telugu

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్-ప్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి.. గంట పాటు నరకయాతన..

విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది. 

Railway staff rescue young woman who stuck between train and platform in duvvada Railway station
Author
First Published Dec 7, 2022, 10:45 AM IST

విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ దిగుతున్న సమయంలో ఓ యువతి జారిపడింది. దీంతో ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది. వివరాలు.. అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటుంది. కాలేజ్‌ వెళ్లేందుకు శశికళ  గుంటూరు-రాయగడ రైలులో దువ్వాడకు చేరుకుంది. అయితే రైలు దిగుతున్న సమయంలో ఆమె ప్లాట్‌ఫామ్-ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

అయితే ఇది గమనించిన రైల్వే పోలీసులు, సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును నిలిపివేశారు. అతి కష్టం మీద రైల్వే సిబ్బంది యువతిని బయటకు తీశారు. అయితే ఈ సమయంలో యువతి తీవ్ర నరకయాతన అనుభవించింది. ఆమెను బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరిలించారు. అయితే యువతి ట్రైన్ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రన్నింగ్‌లో ఉండగానే దిగేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios