కొరియా సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు
- కొరియా సూపర్ సిరీస్ ఫైనల్లోకి భారత్ స్టార్ షట్లర్ పివి సింధు దూసుకెళ్ళింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై రెండు సెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.
- ఫైనల్లో జపాన్ ప్లేయర్ నోజోమీ ఒకుహరాతో సింధు ఢీకోనుంది.
- వరల్డ్ చాంపియన్షిప్లో ఒకుహరా చేతిలో ఓడిన సింధు ఈ ఫైనల్లో ఆమెపైనే తలపడేందుకు రెడీ అవుతోంది.
కొరియా సూపర్ సిరీస్ ఫైనల్లోకి భారత్ స్టార్ షట్లర్ పివి సింధు దూసుకెళ్ళింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై రెండు సెట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. మూడు సెట్ల మ్యాచ్ లో 21-10, 17-21, 21-16 విజయంతో సింధు కంఫర్టబుల్ విజయం సాదించటం గమనార్హం. మొదటిసెట్ గెలిచిన సింధు, అనూహ్యంగా రెండో సెట్ కోల్పోయింది. రెండో సెట్లో కుడా మొదట్లో బాగానే ఆడిన సింధు ఎందుకనో కాస్త తడబడింది. దాంతో ప్రత్యర్ధి బాగా పుంజుకుని ఆధిక్యత సాధించింది. దాంతో మూడో సెట్ పై అందరిలో టెన్షన్ మొదలైంది.
అయితే మూడో సెట్ మొదటి నుండి సింధు జాగ్రత్తగా ఆడింది. మొదట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఆడారు. ఫస్ట్ హాఫ్లో సింధు టాప్ గేమ్ ప్రదర్శించినా.. చైనా ప్లేయర్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. అయితే కీలక దశలో పాయింట్లను సొంతం చేసుకున్నది. కానీ మద్యలో ప్రత్యర్ధి పుంజుకోవంటతో మళ్ళీ అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే, గేమ్ మద్యలోకొచ్చేసరికి సింధు వరుసుగా స్మాష్ లు, ప్లేస్ లతో ప్రత్యర్ధిని గుక్కతిప్పుకోనీకుండా ఓ ఆటాడుకుంది. ఓ దశలో 306కిలోమీటర్ల వేగంతో ఓ స్మాష్ షాట్ కొట్టింది. దీంతో మూడవ గేమ్ను 21-16 స్కోర్తో గెలిచి చరిత్ర సృష్టించింది.
మొదటి గేమ్ను సింధు కేవలం 16 నిమిషాల్లోనే సింధు సొంతం చేసుకున్నది. రెండవ గేమ్లో దూకుడుగా ఆడిన సింధు ఓ దశలో 11-6తో పైచేయి సాధించింది. కానీ చైనా ప్లేయర్ ఆ ఆధిక్యాన్ని 15-15కు చేసింది. దీంతో రెండవ గేమ్ ఆసక్తికరంగా మారింది. చివరకు రెండవ గేమ్ను చైనా ప్లేయర్ 21-17 స్కోర్తో చేజిక్కించుకున్నది. కొరియా ఓపెన్సిరీస్లో భారత మహిళా షట్లర్ ప్రవేశించడం ఇదే మొదటిసారి. అయితే ఫైనల్లో జపాన్ ప్లేయర్ నోజోమీ ఒకుహరాతో సింధు ఢీకోనుంది. వరల్డ్ చాంపియన్షిప్లో ఒకుహరా చేతిలో ఓడిన సింధు ఈ ఫైనల్లో ఆమెపైనే తలపడేందుకు రెడీ అవుతోంది.