Asianet News TeluguAsianet News Telugu

మెంటల్ ఆసుపత్రి నుండి పురుషోత్తం దంపతుల డిశ్చార్జ్: మదనపల్లి జైలుకు తరలింపు

జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు విశాఖపట్టణం మానసిక వ్యాధుల చికిత్సాలయం నుండి గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు.

PURUSHOTHAM couple discharged from visakha chinna waltair mental hospital lns
Author
Visakhapatnam, First Published Mar 26, 2021, 10:25 AM IST

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు విశాఖపట్టణం మానసిక వ్యాధుల చికిత్సాలయం నుండి గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు.

ఇద్దరు పిల్లలను మూఢ విశ్వాసాలతో  ఈ దంపతులు ఈ ఏడాది అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన వీరికి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్య చికిత్స కోసం  విశాఖ పట్టణంలోని చినవాల్తేరులోని మానసిక చికిత్సాలయానికి తరలించారు.

ఈ ఆసుపత్రిలో వీరి చికిత్స పూర్తైంది. దీంతో వీరిని మెంటల్ ఆసుపత్రి నుండి మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టైన సమయంలో మదనపల్లి సబ్ జైలులో రాత్రిపూట పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వారిని వైద్యులకు చూపించారు. వైద్యుల సూచన మేరకు చినవాల్తేరులోని మెంటల్ ఆసుపత్రికి తరలించారు.

మెంటల్ ఆసుపత్రిలో ఈ దంపతులకు కౌన్సిలింగ్ పూర్తి చేశారు. ఆరోగ్యం కొంత కుదుటపడడంతో వారిని తిరిగి మదనపల్లి జైలుకు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios