టూ వీలర్ ఆశ చూపి యువతిపై గ్యాంగ్రేప్: నిందితులు చిక్కారిలా...
బెంగుళూరులో యువతిపై గ్యాంగ్ రేప్ బయటపడిందిలా
బెంగుళూరు: ద్విచక్రవాహనం ఇప్పిస్తామని ఓ యువతికి మాయమాటలు చెప్పి గ్యాంగ్రేప్కు పాల్పడిన ఘటన ఆరు మాసాల తర్వాత వెలుగు చూసింది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన మహాలక్ష్మీ లేఔట్ నివాసులు భరత్, ప్రమోద్, హరీష్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల కిందట దుండగులకు ఆ యువతి పరిచయమైంది. ద్విచక్రవాహనం ఇస్తామని ఆశచూపించారు.
నిందితుల మాటలను నమ్మిన ఆ యువతి వారి వెంట వెళ్ళింది. బాధిత యువతిని మాండ్య, తమకూరు ప్రాంతాల్లో తిప్పి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.కానీ ఆమెను అప్పుడప్పుడూ ఈ విషయమై బెదిరింపులకు పాల్పడేవారు.
అయితే ఈ ముగ్గురు నిందితులు ఇటీవల కాలంలో ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యారు. విచారణ సమయంలో గ్యాంగ్ రేప్ విషయాన్ని కూడ నిందితులు బయటపెట్టారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.