ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( ap govt) పాఠశాల విద్యలో (school education) చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని (primary schools) 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గత గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( ap govt) పాఠశాల విద్యలో (school education) చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని (primary schools) 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గత గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా వారికి ఉన్నత బోధనను అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఒకే ఆవరణలో ఉన్న లేదా 250 మీటర్ల లోపు దూరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

అలాగే 1, 2 తరగతుల విద్యార్థులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన కొనసాగించి, ఇతర సీనియర్‌ ఎస్జీటీలను 3, 4, 5 తరగతుల బోధనకు వీలుగా సర్దుబాటు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక తరగతుల్లో టీచర్, విద్యార్థులను 1:20 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏయే ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయాలి, సమీపంలోని ఉన్నత పాఠశాలలు ఏవి ఉన్నాయనే మ్యాపింగ్‌ చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల లభ్యత, వారు సరిపోతారా? సర్దుబాటు చేయాలా? అన్న దానిపైనా తగిన కసరత్తు చేసి ఆ మేరకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.