సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడాలని..అప్పుడే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఆ ఆలయ పూజారి సదరు దంపతులకు మాయమాటలు చెప్పాడు. అతను చెప్పిన మాటలు నిజమని నమ్మిన ఆ మహిళ అతని వెంట వెళ్లింది. అక్కడ... ఆ ఆలయ పూజారి.. సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 

ఆలయంలో నిత్యం పూజలు, పునస్కారాలు చేసే ఓ పూజారి.. అదే ఆలయంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం స్వామివారి దర్శనార్థం గ్రామంలోని ఆలయానికి వచ్చారు. సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకుడి పాదాలయు నమస్కరించారు.

సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడాలని..అప్పుడే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఆ ఆలయ పూజారి సదరు దంపతులకు మాయమాటలు చెప్పాడు. అతను చెప్పిన మాటలు నిజమని నమ్మిన ఆ మహిళ అతని వెంట వెళ్లింది. అక్కడ... ఆ ఆలయ పూజారి.. సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

కాగా... మహిళ ప్రతిఘటించి.. ఆ పూజారిని నెట్టేసి.. గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీసింది. మహిళ గట్టిగా అరవడంతో భయపడిపోయిన పూజారి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... దంపతులు ఈ విషయాన్ని వెంటనే గ్రామస్థులకు తెలియజేశారు. కాగా... విషయాన్ని బయటకు రానీయకుండా దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.