Asianet News TeluguAsianet News Telugu

వైద్యం కోసం 15 మీటర్లు డోలిలో: గర్బిణీ క్షేమం, బిడ్డ మృతి

చంద్రుడి మీదకు మనిషిని పంపే స్థాయికి చేరిన భారతదేశంలో నేటికి కూడా ఏజెన్సీలో వైద్యం కూడా దొరక్క గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి

Pregnant woman carried on doli for 15 kms through in visakapatnam district
Author
Visakhapatnam, First Published Apr 29, 2020, 6:19 PM IST

చంద్రుడి మీదకు మనిషిని పంపే స్థాయికి చేరిన భారతదేశంలో నేటికి కూడా ఏజెన్సీలో వైద్యం కూడా దొరక్క గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలోని వైద్యం కోసం 15 కిలోమీటర్లు నడిచి ఓ నిండు గర్బిణీ బిడ్డను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే...పాడేరు మండలం మాదిగబంధ గ్రామానికి చెందిన గర్భిణీకి బుధవారం నొప్పులు వచ్చి ఇంట్లోనే ప్రసవం జరిగింది.

ఈ క్రమంలో పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే గర్బిణీ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటే బంధువులు, గ్రామస్తులు ఆమెను డోలిలో 15 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి క్షేమంగా ఉండగానే బిడ్డ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. 

Also Read:

వైసీపీకి ఏటీఎంగా మారిన కరోనా: చంద్రబాబు విమర్శ

కరోనాపై జగన్ సమీక్ష: మత్స్యకారుల క్షేమ సమాచారంపై సీఎం ఆరా

Follow Us:
Download App:
  • android
  • ios