Asianet News TeluguAsianet News Telugu

కొద్దిరోజుల్లో పెళ్లి: వేరే వ్యక్తిని ప్రేమించి.. ప్రియుడితో బావను చంపించింది

కొద్ది రోజుల క్రితం కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికూతురే.. తన ప్రియుడి చేత కాబోయే భర్తను చంపించినట్లుగా పోలీసులు నిర్థారించారు

police solved railway kodur murder case
Author
Railway Koduru, First Published Jun 16, 2019, 12:08 PM IST

కొద్ది రోజుల క్రితం కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికూతురే.. తన ప్రియుడి చేత కాబోయే భర్తను చంపించినట్లుగా పోలీసులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. రైల్వేకోడూరుకు చెందిన అబ్ధుల్ ఖాదర్‌కు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో ఉంటున్న తన మేనత్త కూతురు శబ్నతో ఈ నెల 23న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.

అయితే అప్పటికే శబ్న అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ అనే యువకుడని ప్రేమించింది. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన ప్రియుడితోనే సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను చంపుతావా లేక నన్నే చంపమంటావా అని శబ్న తన ప్రియుడిని ప్రశ్నించింది. దీంతో ప్రిన్స్.. ఖాదర్ హత్యకు కుట్ర పన్నాడు. తన స్నేహితులైన దీనదయాల్‌, సెల్వం, లక్ష్మణ్, బ్రిస్టన్‌లకు రూ.7 లక్షలు ఇచ్చి ఖాదర్‌ను చంపాలని చెప్పాడు.

ఈ క్రమంలో ఈ నెల 5న రంజాన్ పర్విదనం రోజున ఉదయం 5.30 గంటలకు అబ్ధుల్ ఖాదర్ రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సు దిగాడు. అక్కడే పాలప్యాకెట్ తీసుకుని తన ఇంటికి వెళ్తుండగా సమీపంలోనే మాటు వేసి ఉన్న దుండగులు కృష్ణాహోటల్ పక్క వీధిలో అతనిని కత్తులతో నరికి చంపారు.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శబ్న ప్రియుడు ప్రిన్స్‌, అతని స్నేహితులు సెల్వం, దీనదయాల్‌ను అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios