కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముదస్తుగా రాపాక ముఖ్య అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త  వాతావరణ నెలకొంది.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అరెస్టుకి రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఆందోళన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముదస్తుగా రాపాక ముఖ్య అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై...ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ... ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది. మరికాసేపట్లో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.