Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల అతి తెలివి... నలుగురు చిన్నారులపై వరకట్నం కేసు

గుంటూరు జిల్లా  చంద్రాపురానికి చెందిన పి. బిందు కి 2018లో ఆదరణ కుమార్ తో వివాహమైంది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తపు అదనపు కట్నం  కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.

police file dowry case against four children
Author
Hyderabad, First Published Oct 30, 2019, 7:59 AM IST

పోలీసుల అతి తెలివితో... నలుగురు  చిన్నారులపై వరకట్నం కేసులు పెట్టారు. కాగా... తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని ఆ నలుగురు చిన్నారులు తమ పెద్దలతో కలిసి కోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ లో నలుగురు చిన్నారులపై వరకట్న కేసు నమోదైంది. పోలీసులు యాంత్రికంగా వ్యవహరించి, నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని ఆ నలుగురు చిన్నారులు తమ పెద్దలతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా  చంద్రాపురానికి చెందిన పి. బిందు కి 2018లో ఆదరణ కుమార్ తో వివాహమైంది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తపు అదనపు కట్నం  కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.

పోలీసులు వారిపై వరకట్న వేధింపులు, భారత శిక్షాస్మృతి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6, 9, 11ఏళ్ల వయసుగల ఆడపడుచుల కుమారులు, కుమార్తెలు నలుగురిని నిందితులుగా పేర్కొనడం గమనార్హం.

దాంతో తమపై కేసు కొట్టేయాలని చిన్నారులతోపాటు ఇతర నిందితులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును న్యాయస్థానం పరిశీలించి తీర్పు ఇవ్వనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios