Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు హత్య కేసు : తల్లితో సహజీవనం చేయాలని ఉందన్నాడని.. బండరాయితో మోది..

మద్యం సేవిస్తుండగా మృతుడు  శ్రీనివాస్ రెడ్డి మస్తాన్  తల్లి విషయంలో  లో మళ్లీ తప్పుడు ధోరణిలో మాట్లాడారు దీంతో నిందితుడు పక్కనే ఉన్న బండరాయితో మృతుడి తలపై మోది మెడలోని కండువాను గొంతుకు బిగించి హత్య చేసి, పక్కనే ఉన్న ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి, పట్టాను కప్పేసాడు.

police crack guntur man assassination case in andhrapradesh
Author
Hyderabad, First Published Sep 2, 2021, 11:04 AM IST

గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగర శివారులోని బొంత పాడు వద్ద గత నెల 28వ తేదీ వ్యక్తి హత్య జరిగిన సంగతి తెలిసిందే.  స్థానిక వార్డు సచివాలయం కార్యదర్శి కె. రాజేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.

సౌత్ జోన్ రూరల్ డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి వై. జెస్సీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా యుద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి గ్రామానికి చెందిన బొడ్డు మస్తాన్,  మృతుడు అట్లూరి శ్రీనివాస్ రెడ్డి కలిసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు.  శ్రీనివాసరెడ్డి భార్య 2 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.  శ్రీనివాస్ రెడ్డి మద్యం తాగిన సమయంలో నిందితుడు మస్తాన్ తో మీ నాన్న చనిపోయాడు,  నాకు  నా భార్య చనిపోయింది.  మీ అమ్మతో సహజీవనం చెయ్యాలని ఉంది.  అని అనే వాడిని,  దీంతో నిందితుడు అలా అనొద్దని నచ్చజెప్పేవాడు అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం శ్రీనివాస్ రెడ్డి ఒడిశాలో బంధువుల ఇంటికి వెళ్లాలని చెప్పి,  బస్సు ఎక్కించమని నిందితుడు మస్తాన్ ను కోరాడు.  గుంటూరు బస్టాండ్ కి వెళ్లేటప్పటికి బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరూ ఏటుకూరు సమీపంలోని పొలాల్లో మద్యం సేవించారు. మద్యం సేవిస్తుండగా మృతుడు  శ్రీనివాస్ రెడ్డి మస్తాన్  తల్లి విషయంలో  లో మళ్లీ తప్పుడు ధోరణిలో మాట్లాడారు దీంతో నిందితుడు పక్కనే ఉన్న బండరాయితో మృతుడి తలపై మోది మెడలోని కండువాను గొంతుకు బిగించి హత్య చేసి, పక్కనే ఉన్న ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి, పట్టాను కప్పేసాడు.

విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ ప్రేమయ్య, ఎస్సై కిషోర్, సిబ్బందిని డిఎస్పీ, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ప్రత్యేకంగా అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios