విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ దుర్గ కొడుకు అరెస్ట్..
విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. విజయవాడ 61వ డివిజన్కు చెందిన కార్పొరేటర్ దుర్గ కొడుకు దనశేఖర్ వద్ద తాను రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నానని ఫణికుమార్ అనే వ్యక్తి చెప్పాడు. అయితే ఇప్పటివరకు రూ. 2 లక్షలు వసూలు చేశాడని తెలిపారు. తన భార్యను కూడా ధనశేఖర్ వేధించాడని ఆరోపించాడు.
ఈ మేరకు ఫణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ధనశేఖర్పై 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.