Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ దుర్గ కొడుకు అరెస్ట్..

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

police booked tdp corporator son in vijayawada
Author
First Published Aug 17, 2022, 5:17 PM IST

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన అప్పుకు అధిక వడ్డీ వసూలు చేయడంతో పాటుగా, తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. విజయవాడ 61వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ దుర్గ కొడుకు దనశేఖర్‌ వద్ద తాను రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నానని ఫణికుమార్ అనే వ్యక్తి చెప్పాడు. అయితే ఇప్పటివరకు రూ. 2 లక్షలు వసూలు చేశాడని తెలిపారు. తన భార్యను కూడా ధనశేఖర్ వేధించాడని ఆరోపించాడు. 

ఈ మేరకు ఫణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ధనశేఖర్‌పై 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios