Asianet News TeluguAsianet News Telugu

ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

 ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.

plea agianst e-watch app in ap AP high court lns
Author
Guntur, First Published Feb 4, 2021, 10:24 AM IST

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించనుంది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించనుంది.ఈ-వాచ్ యాప్ పై వైఎస్ఆర్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  అయితే ఈ అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు.యాప్ పనితీరును వివరించారు.ఈ యాప్‌నకు వ్యతిరేకంగా  వైఎస్ఆర్‌సీపీ మరో యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-నేత్రం పేరుతో మరో యాప్ ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది.

also read:ఎస్ఈసీ యాప్‌పై లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరణ: రేపు విచారిస్తామన్న హైకోర్టు

ఈ-వాచ్ యాప్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ వినతిపత్రాన్ని సమర్పించింది.  తమ అనుమానాలను ఈ వినతిపత్రంలో ప్రస్తావించింది.ఈ నేత్రం యాప్  ద్వారా తమకు అందిన ఫిర్యాదులను వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎస్ఈసీకి అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios