Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఘాట్‌‌లో కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

తిరుమల రెండో ఘాటో రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. 

pilgrims safely escapes major bus accident at tirumala ghat road
Author
Tirupati, First Published Nov 25, 2018, 11:36 AM IST


తిరుపతి: తిరుమల రెండో ఘాటో రోడ్డులో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో  సుమారు 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.

తిరుమలలోని రెండో ఘాట్‌రోడ్డులో ఆదివారం నాడు  ఆర్టీసీ బస్సు లింకు రోడ్డు వద్ద కొండను ఢీకొట్టింది.  ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని ప్రయాణీకులు తెలిపారు.

వేగంగా డ్రైవర్ బస్సును నడపడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని  ప్రత్యక్షసాక్లులు తెలిపారు.  బస్సు స్టేషన్ నుండి బస్సు బయలు దేరిన సమయంలో రెండు చోట్ల ప్రమాదం నుండి తప్పించుకొంది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ జాం అయింది.   పోలీసులు  ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలను తిరిగి తిరుమలకు పంపించారు.

క్షతగాత్రులను తిరుపతి రిమ్స్ కు తరలించారు. ఈ ఘటన గురించి ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios