ఏపీలో ఆక్సీజన్ కొరత రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అనేక ఆస్పత్రుల్లో ఐసీయూ లో ఉన్న రోగులకు సరైన సమయంలో ఆక్సీజన్ అందించలేకపోతున్నారు. దీంతో రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీలో ఆక్సీజన్ కొరత రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అనేక ఆస్పత్రుల్లో ఐసీయూ లో ఉన్న రోగులకు సరైన సమయంలో ఆక్సీజన్ అందించలేకపోతున్నారు. దీంతో రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

"

తాజాగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 8.00 గంటలకు కోవిడ్ వార్డులో ఆక్సిజన్ అయిపోయింది. ఈ విసయం డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఏమీ స్పందించకపోవడంతో రోగులు, వారి బంధువులు భయాందోళనలో ఉన్నారు. 

దీంతో ఈ విషయం మీద మండల కమాండర్ తహశీల్దార్ అనిల్ కుమార్ కు రోగి బంధువులు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన తహశీల్దార్ దీనిమీద చర్యలకు ఆర్ ఐ జానిబాష ను పంపించారు. 

వెంటనే రంగంలోకి దిగిన జానీ బాషా..నరసరావుపేట నుండి అర్థరాత్రి పూట ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించి రోగుల ప్రాణాలను కాపాడారు. దీంతో రోగుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.