తూ.గో జిల్లాలో ఓఎన్జీసీ పైప్లైన్ నుండి గ్యాస్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు
తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ పైప్లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ పైప్లైన్ నుండి శుక్రవారం నాడు గ్యాస్ లీకౌతోంది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్లైన్ నుండి గ్యాస్ లీకౌతున్న విషయాన్ని స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ సమాచారం అందుకొన్న ఓఎన్జీసీ అధికారులు గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. గ్యాస్ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో లైటర్లు, సెల్ఫోన్లు ఉపయోగించకూడదని అధికారులు ఆదేశించారు.
గతంలో కూడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓఎన్జీసీ పైప్లైన్ నుండి గ్యాస్ లీకైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సమయాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడ చోటుచేసుకొన్నాయి.
ఈ ఏడాది మే 18వ తేదీన ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. ఇదే జిల్లాలోని మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామంలో గ్యాస్ లీకైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది. సుమారు నెల రోజుల తర్వాత ఇదే జిల్లాలో మరోసారి పైప్ లైన్ నుండి గ్యాస్ లీకైంది.