భూసేకరణలో ఆసల్యం వల్లే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 

న్యూఢిల్లీ: భూసేకరణలో ఆసల్యం వల్లే విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. విజయవాడ- అమరావతి రింగ్ రోడ్డుతో పాటు ఇతర రోడ్ల నిర్మాణం గురించి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అయితే భూసేకరణ వల్లే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమైనట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన అవలంభిస్తున్న పద్దతులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూసేకరణ పూర్తి చేస్తే ఈ నిర్మాణాన్ని సకాలంలో పూర్తయ్యేదని గడ్కరీ చెప్పారు.