స్కూల్లో తోటి విద్యార్థితో ఘర్షణ పడ్డ ఓ విద్యార్థి అతడిని అందరి సమక్షంలోనే చాకుతో పొడిచాడు.
రాజానగరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మరో విద్యార్థి చాకుతో పొడిచాడు. పరీక్షా కేంద్రంలో ఉపాద్యాయుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్సడిన ఆ విద్యార్థి పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
