నేనే రాశా: విజయసాయి రెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానే అని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో తానే ఆ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషనర్ గా తనకున్న అధికార పరిధిలోనే లేఖ రాసినట్లు చెప్పారు.
ఆ లేఖపై ఎవరికీ ఏ విధమైన సందేహాలు కూడా అవసరం లేదని ఆయన అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారని ఆయన చెప్పారు. దానిపై ఏ విధమైన ఆందోళన, సందేహాలు అవసరం లేదని రమేష్ కుమార్ అన్నారు. దానిపై ఏ విధమైన వివాదాలు, రాద్దాంతాలకు తావు లేదని అన్నారు.
రమేష్ కుమార్ రాసిన ఆ లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ విజయసాయి రెడ్డి బుధవారం డీజీపీ గౌతం సవాంగ్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ ఫోర్జరీ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.