Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ సాయిప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్: బెంగళూరులో ప్రియుడితో పెళ్లి, తాళిబొట్టుతో పేరెంట్స్‌కు ఫోటో

విశాఖ ఆర్కే బీచ్‌లో మిస్సయినట్లుగా డ్రామా ఆడిన వివాహిత సాయిప్రియ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రులకు సాయిప్రియ వాట్సాప్ మెసేజ్ పంపింది. తాను బెంగళూరులో క్షేమంగానే వున్నానని.. వెతకొద్దని అందులో తెలిపింది. 

new twist in vizag women sai priya missing case
Author
Visakhapatnam, First Published Jul 27, 2022, 7:45 PM IST

విశాఖ ఆర్కే బీచ్‌లో మిస్సయినట్లుగా డ్రామా ఆడిన వివాహిత సాయిప్రియ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రులకు సాయిప్రియ వాట్సాప్ మెసేజ్ పంపింది. తాను బెంగళూరులో క్షేమంగానే వున్నానని.. వెతకొద్దని అందులో తెలిపింది. తాళిబొట్టుతో వున్న ఫోటోను పేరెంట్స్‌కు పంపింది సాయిప్రియ. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. రవి అనే వ్యక్తితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని ఆమె చెప్పింది. తాను బతకాలని అనుకుంటున్నానని... తన కోసం వెతకొద్దని , వెతికితే ఇద్దరం చనిపోతామంటూ సాయిప్రియ మెసేజ్‌లో తెలిపింది. రవి పేరెంట్స్‌ని ఏం చేయద్దని ఆమె కోరింది. 

కాగా.. బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. తాజాగా నెల్లూరులో ప్రత్యక్షం అయినట్లు, ఆమె నెల్లూరులో మరో యువకుడితో కలిసి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారని తొలుత వార్తలు వచ్చాయి. ఈ మేరకు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే ప్రియుడి కోసమే ఆమె భర్త ఫోన్ చూస్తున్న సమయంలో అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఎన్‌ఎడి జంక్షన్‌కు చెందిన  శ్రీనివాసరావు, సాయిప్రియ దంపతులు సోమవారం తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో కాసేపు గడిపిన తర్వాత.. ఆ దంపతులు నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. 

ALso Read:వైజాగ్ బీచ్‌లో వివాహత మిస్సింగ్ కేసులో ఊహించని మలుపు.. నెల్లూరులో గుర్తించిన పోలీసులు.. అదే కారణమా..?

ఆ సమయంలో  శ్రీనివాసరావు తనకు ఏదో ముఖ్యమైన మెసేజ్ వచ్చిందని నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. అయితే ఫోన్ చూడటం పూర్తయ్యాక చూస్తే తన భార్య కనిపించలేదు. ఎంత వెతికినా ఆమె జాడ లేకపోవడంతో శ్రీనివాసరావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె నీటిలో గల్లంతు అయి ఉంటుందని భావించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో పోలీసులు సరైన సోదాలు నిర్వహించలేకపోయారు. అయితే మంగళవారం ఉదయం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి హెలికాప్టర్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి రెండు పెట్రోలింగ్ నౌకలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే వారు సాయిప్రియ గురించిన ఎలాంటి ఆచూకీని కనుగొనలేకపోయారు. 

ఇక, సాయిప్రియకు శ్రీనివాసరావుతో 2020 జూలై లో వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారని.. జూలై 25న తన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారని పోలీసులు చెప్పారు. సోమవారం ఉదయం సింహాచలం వెళ్లి .. సాయంత్రం సరదాగా గడిపేందుకు ఆర్‌కే బీచ్‌కు వచ్చినట్టుగా  శ్రీనివాసరావు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios