ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి... అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి... అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.
ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అని ప్రశ్నించారు.
తొలి విడతలో కోవిడ్ వైరస్ చిన్నపాటి జ్వరం లాంటిదేనని, పారాసెటమాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చల్లితే చస్తుంది..ఇట్ కమ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్బీ నిరంతర ప్రక్రియ, సహజీవనం అంటూ ఫేక్ మాటలతో వేలాది మందిని బలిచ్చారని మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగం: మాస్క్ ధరించకుండా అసెంబ్లీలో జగన్ (ఫోటోలు)...
సెకండ్వేవ్లో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ,మీరే మాస్క్ ధరించకుండా ఇంకెన్ని వేలమంది ప్రాణాలు పణంగా పెడతారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మనిషినని నిరూపించుకుంటారో మీ ఇష్టం అని నారాలోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజుకే అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ సమావేశాలకు హాజరైన జగన్ మాస్క్ ధరించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
