వైఎస్ జగన్ పై నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతిలో శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని మండిపడ్డారు.
వైఎస్ జగన్ పై నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతిలో శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని మండిపడ్డారు.
Add Asianetnews Telugu as a Preferred Source

జగన్ రెడ్డికి దేవుడంటే లెక్కలేదు,ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.
తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలుసు జగన్ రెడ్డి గారు... అంటూ ట్వీట్ చేశారు.
