ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్
కర్నూల్ జిల్లా నంద్యాలలో కానిస్టేబుల్ అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాలలో కానిస్టేబుల్ అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
ఈ నెల 3వ తేదీన ఆటో డ్రైవర్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ కేసు విచారణ చేసేందుకు గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీతో డీజీపీ గౌతం సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు
గుంటూరు రేంజ్ ఆధ్వర్యంలో ఇవాళ కమిటీ నంద్యాలకు చేరుకొంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబం సీఐ సోమశేఖర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
జ్యూయలరీ షాపు దొంగతనం కేసులో సలాం ను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ సోమశేఖర్ రెడ్డిని శనివారం నాడు సస్పెండ్ చేశారు.
also read:నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ
అబ్దుల్ సలాం బంధువుల నుండి సీఐపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో విచారణ కమిటీ ఇవాళ ఈ కేసు విషయమై విచారణను ప్రారంభించింది.విచారణ ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత సోమశేఖర్ రెడ్డితో పాటు కానిస్టేబుల్ గంగాధర్ ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకొన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆధేశాలతో ఈ కేసును పోలీసులు కూడ దర్యాప్తును వేగవంతం చేశారు.తప్పు చేస్తే ఎంతటివారైనా వదలమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.