గ్రామాలలో ఎల్ ఇ డి వీధి దీపాలు ఏర్పాటుచేసే కార్యక్రమం ఆంధ్రతోనే మొదలవుతూ ఉంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా నారా లోకేశ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఒక కీలకమయిన సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన దస్త్రం మీద తొలి సంతకం చేశారు. తర్వాత మరొక రెండు ఫైళ్ల మీద కూడా ఆయన సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.
అవి : 1. ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే దస్త్రంపై తొలి సంతకం. దీని ద్వారా రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
2. అనంతరం పంచాయతీరాజ్ ద్వారా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ దస్త్రంపైనా ,
3. ఆపైన గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు.
ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశే. ఇపుడు ఈ కార్యక్రమం నారా లోకేశ్ పర్యవేక్షణలో జరుగుతుంది.
ఈ సందర్భంగా లోకేశ్ గారుమాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెండేళ్లలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.
