శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. ఈ రోజు ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని శ్రీవారికి సమర్పించారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. ఈ రోజు ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని శ్రీవారికి సమర్పించారు. ఈ మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నామని.. ప్రాణాపాయంలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడాలని ఆయన తెలిపారు. ఈ విరాళాన్ని కంపెనీ ప్రతినిధి ద్వారా ముఖేశ్ టీటీడీకీ అందించారు.