చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఎంపీ పీఏ ఒకరు ప్రసూతి వార్డులో పనిచేస్తున్న హెడ్ నర్సుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ నర్స్ పట్ల ఎంపీ పీఏ ఒకరు తన నీచబుద్ధిని బయటపెట్టారు. ఆమె ప్రభుత్వాసుపత్రిలో హెడ్ నర్స్ గా పని చేస్తోంది. అక్కడ ప్రసూతి వార్డులో తన సేవలు అందిస్తోంది. ఆమెతో ఎంపీ పీఏ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన బుధవారం నాడు రాత్రివేళ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
ఓ ఎంపీకి చెందిన పీఏ.. రెండు రోజుల కిందట ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేశాడు. ఆస్పత్రికి తన బంధువులు డెలివరీ కోసం వస్తున్నారని చెప్పుకొచ్చాడు. కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఎంపీ పీఏ స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆస్పత్రి వర్గాలు ఆ వచ్చిన పేషంట్ల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ప్రసూతి వార్డులో ఓ హెడ్ నర్స్ ఉంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎంపీ పీఏ ఆమె చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ మేరకు విశ్వసనీయ సమాచారం వెలుగు చూసింది. అనుకోని ఈ పరిణామానికి ఆ నర్సు భయంతో పరుగులు తీసింది.తన తోటి నర్సులతో ఈ విషయం చెప్పింది. వెంటనే వారు డిసిహెచ్ఎస్ బీసీకే నాయక్ కు జరిగిన విషయం మీద ఫిర్యాదు చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, సదరు వ్యక్తి ఎంపీకి పీఏ కావడం, మంత్రికి సన్నిహితుడు కావడంతో ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుందోనని నర్సులు కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నా కులానికి టీడీపీ అంటే ప్రేమే.. కానీ : వైసీపీలో చేరాక జయమంగళ వెంకటరమణ వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, గురువారం భువనేశ్వర్ లో మహిళా పోలీసు అధికారిపై బీజేపీ నేత దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. సంబల్పూర్లో బీజేపీ నిరసనలు చేస్తున్న సమయంలో లంచం తీసుకుంటోందని ఆరోపిస్తూ ఓ మహిళా పోలీసు అధికారిపై ఒడిశా ప్రతిపక్ష నేత జయనారాయణ మిశ్రా దాడి చేయడం వివాదాస్పదమైంది. అయితే, సంబల్పూర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆ అభియోగాన్ని తోసిపుచ్చారు. ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనితా ప్రధానే తనను నెట్టారని ఆరోపించారు.
ఈ ఘటన మీద ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బుధవారం ఈ ఘటన సంబల్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట జరిగింది. శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సంబల్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల బిజెపి నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన మీద అనితా ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘బిజెపి కార్యకర్తలు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వారిని కంట్రోల్ చేస్తూ ఆమె మిశ్రాకు ఎదురుగా వచ్చింది. దీంతోను నువ్వెవరు అని మిశ్రా అడిగాడు. ఆమె తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోగానే.. నువ్వు లంచం తీసుకుంటున్నావని ఆరోపించాడు. నన్ను డకాయిట్ అని పిలిచాడు. అలాంటి ఆరోపణలుఎందుకు చేస్తున్నారని నేను అడిగినప్పుడు, మిశ్రా నా ముఖం మీద చేయివేసి వెనక్కి నెట్టాడు" అని మహిళా అధికారి చెప్పారు.
అయితే మహిళా కార్మికులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని విని తాను ముందుకొచ్చానని మిశ్రా అభియోగాన్ని తోసిపుచ్చారు. "నేను పోలీసులపై దాడి చేశానని, విరుచుకుపడుతున్నానని, నెట్టానని అంటున్నారు. కానీ నేను ఆమెను నెట్టలేదు. పోలీసులపై ఆరోపణలు వచ్చినందున, వారు కుట్ర పన్నారు... నాకు ఆమె ఎవరో తెలియదు’ అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు.
ఘటనపై ఫీల్డ్ రిపోర్టు కోరామని, దీనిపై విచారణ జరుపుతామని సంబల్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ బి గంగాధర్ తెలిపారు. మిశ్రాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒడిశా పోలీస్ సర్వీస్ అసోసియేషన్, సంబల్పూర్ చాప్టర్ ఉత్తర రేంజ్ డీఐజీకి వెళ్లింది. బీజేపీ అధికార ప్రతినిధి లలితేందు బిద్యాధర్ మహపాత్ర మాట్లాడుతూ.. జార్సుగూడ జిల్లాలో ఓ పోలీసు మంత్రిని హత్య చేశాడని.. ఇప్పుడు ఓ మహిళా పోలీసు ప్రతిపక్ష నేతపై విరుచుకుపడుతోందని.. ఒడిశాలో చట్టబద్ధత లేదు.. ఆ అధికారికి వ్యతిరేకంగా సీఎం దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎదురుచూస్తున్నామని అన్నారు.
