Asianet News TeluguAsianet News Telugu

మొబైల్ ఫోన్ దొంగతనం.. బాలుడి దారుణ హత్య

ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. 

mob attack on minor boy over smart phone in chittoor
Author
Hyderabad, First Published Jul 31, 2020, 4:26 PM IST

మొబైల్ ఫోన్ కోసం ఓ బాలుడి ప్రాణం తీశారు. ఫోన్ దొంగలించాడనే కారణంతో.. చిన్నపిల్లాడనే కనికరం కూడా లేకుండా కొట్టారు. కాగా.. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడిని చితకబాదారు. మొబైల్ దొంగించాడంటూ ఇరు వర్గాలు కలిసి ఓ బాలుడిని చితకబాదారు. ఈ దాడిలో బాలుడు తీవ్ర గాయపడ్డాడు. స్పృహతప్పి నేలకొరిగాడు. అయితే బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ విషయంలో అందరికీ తెలియడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios