Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎమ్మెల్సీపై వల్లభనేని వంశీ తిట్లదండకం...అది కూడా లైవ్ లో

 ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేంద్ర అన్నా అంటూ మెుదలుపెట్టిన వంశీ అనంతరం సహనం కోల్పోయారు. డొక్క పగులుద్ది, నోరూ మూస్కోవోయ్, ఆ భూములు నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా, ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా అంటూ బండబూతులు తిట్టారు. 
 

mla vallabhaneni vamsi mohan Abuses tdp mlc babu rajendraprasad
Author
Vijayawada, First Published Nov 15, 2019, 12:49 PM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఒక ప్రముఖ ఛానెల్ లైవ్ లో ఏకంగా బండ బూతులు తిట్టారు. అయ్యప్పమాలలో ఉన్న వంశీ తిట్టిన తిట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

గురువారం వల్లభనేని వంశీమోహన్ తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ప్రముఖ ఛానెల్ లో డిబేట్ జరుగుతుంది. ఈ డిబేట్ లో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వల్లభనేని వంశీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

వల్లభనేని వంశీకి అయన తండ్రిని జన్మనిస్తే, చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మనిచ్చారంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యామిలికి దగ్గర అయిన దాసరి కుటుంబాన్ని పక్కనబెట్టి మరీ వంశీకి చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. 

ఇకపోతే మాజీమంత్రి దేవినేని ఉమాపై వంశీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా వంశీ తరలించడానికి ప్రయత్నిస్తే దేవినేని ఉమా మోటార్లు అపుడే పెట్టొద్దన్నారని గుర్తు చేసారు అందుకు చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారని రాజేంద్రప్రసాద్ తెలిపారు.  

అప్పుడే లైవ్ లోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేంద్ర అన్నా అంటూ మెుదలుపెట్టిన వంశీ అనంతరం సహనం కోల్పోయారు. డొక్క పగులుద్ది, నోరూ మూస్కోవోయ్, ఆ భూములు నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా, ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా అంటూ బండబూతులు తిట్టారు. 

అక్కడితో ఆగిపోలేదు నోరు మూయరా, ఒంటికన్నుగా, చెత్త****,చెత్త****** చెప్పు తెగుతుంది రాజేంద్ర అంటూ బూతుపురాణం మెుదలెట్టేశారు. ఏదిపడితే అది మాట్లాడితే మెహం పగిలిద్ది అంటూ చిర్రుబుర్రులాడారు. జోకర్, బఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాయడానికి కూడా వీల్లేని విధంగా బండబూతులు తిట్టారు వంశీ మోహన్.  

అంతటితో ఆగిపోలేదు బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎలా ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారో వల్లభనేని వంశీ పూస గుచ్చినట్లు వివరిస్తే... వల్లభనేని వంశీ ఎలా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకున్నారో బాబూ రాజేంద్రప్రసాద్‌ సవివరంగా చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల పంపకాలు ఎలా జరుగుతాయో, ఏ విలువలకి తిలోదకాలిచ్చి టీడీపీ రాజకీయాలు చేస్తోందో ప్రస్తుత, మాజీ నేతల మధ్య ఈ బూతుల యుద్ధం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. 

వల్లభనేని వంశీమోహన్ బూతు పురాణంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే అయ్యప్పమాలలో ఉన్న వంశీ తిట్లపురాణంపై సర్వత్రా చర్చజరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జూ.ఎన్టీఆర్‌పై వంశీ వ్యాఖ్యలు: మళ్లీ ముందుకొచ్చిన నారా, నందమూరి మధ్య తేడాలు

జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ

Follow Us:
Download App:
  • android
  • ios