‘‘మా బావ వైసీపీ నుంచి పోటీచేయకుంటే.. నేను టీడీపీ నుంచి చేస్తా’’
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆసక్తి తనకు లేదని ఆయన చెప్పారు.
తన బావ అయోధ్య రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయకపోతే తాను నర్సారావుపేట ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆసక్తి తనకు లేదని ఆయన చెప్పారు. అయితే.. సీఎం చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమని చెబితే.. అక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను గౌరవం ఉన్న పార్టీలోనే కొనసాగుతానన్నారు. టీడీపీలో తనకు గౌరవం లభిస్తోందని ఆయన వివరించారు.