ఏపీలో పాలనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ కౌంటరిచ్చారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని.. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ (trs) కేటీఆర్ (ktr) వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ (jogi ramesh) కౌంటరిచ్చారు. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్కు మంత్రి సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ (kcr) లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని.. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జోగి రమేష్ ప్రశ్నించారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఏపీకి వస్తే అమ్మ ఒడి , ఆసరా, 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం, ప్రతి గ్రామంలో సచివాలయం, డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుందని జోగి రమేష్ పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ (mk stalin) కూడా మెచ్చుకున్నారని మంత్రి పేర్కొన్నారు. అక్కడా సచివాలయ వ్యవస్థను పెడతామన్నారని జోగీ రమేష్ చెప్పారు . దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారని మంత్రి ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. తాము కేబినెట్లోనూ సామాజిక న్యాయం పాటించామని.. ఏపీలో జరిగినట్టు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.
కాగా.. శుక్రవారం Hyderabadలో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో Roads ధ్వంసమయ్యాయని చెప్పారు. Electricity , Drinking Water కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు.
ఇతర రాష్ట్రాలో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు.పరిశ్రమలకు ెపారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల మీద పెట్టేది పెట్టుబడి అవుతుందనికేటీఆర్ చెప్పారు.111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ జీవోను నా కోసమే ఎత్తివేశారని ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో కూడా ఈ జీవోను ఎత్తివేసేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.1.30 లక్షల ఎకరాలు నావేనా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉందని ఆ ప్రాంతానికి చెందినవారు తనకు చెప్పారని కేటీఆర్ వివరించారు. బెంగుళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నాయని కేటీఆర్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ప్రశాంతమైన రాష్ట్రమని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో ఏపీ వాసులకు అర్ధమైందని కేటీఆర్ చెప్పారు.
