Asianet News TeluguAsianet News Telugu

15 ఏళ్లుగా చూస్తూనే వున్నాం.. ఏం తేలుస్తారు, గొంగూర కట్ట: పవన్‌పై బొత్స సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు.. గొంగూర కట్ట అంటూ మండిపడ్డారు. గత 15 ఏళ్ల నుంచి ఏం తేలుస్తున్నారో చూస్తూనే వున్నామని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు

minister botsa satyanarayana satires on janasena pawan kalyan
Author
Amaravati, First Published Oct 1, 2021, 8:39 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు.. గొంగూర కట్ట అంటూ మండిపడ్డారు. గత 15 ఏళ్ల నుంచి ఏం తేలుస్తున్నారో చూస్తూనే వున్నామని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2009 నుంచి చొక్కాలు చింపుతా అంటున్నారని... ఇప్పటికి ఎన్ని చొక్కాలు చింపారని బొత్స ప్రశ్నించారు. 

మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపైనా కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన స్నేహితుడిలాగే సోము వీర్రాజుకు కూడా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువంటూ సెటైర్లు వేశారు. కేంద్రం నిధులు ఉపయోగించి  క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదని.. ప్రజల భాగస్వామ్యంతో వసూలైన డబ్బుతోనే క్లాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. కేంద్రం నిధులు వుంటే కచ్చితంగా ప్రస్తావిస్తామని సత్తిబాబు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో యూజర్ ఛార్జీల కింద సుమారు రూ.350 కోట్లు వసూలైందని మంత్రి తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios