Asianet News TeluguAsianet News Telugu

అఖిలప్రియ రెచ్చిపోతోందిగా....

  • నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ రెచ్చిపోతోంది.
  • ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డిపై తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది.
  • గుంటూరు పర్యటనలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపఎన్నిక ఓటమితోనే శిల్పా బ్రదర్స్ నంద్యాల వదిలి పారిపోయారట.
Minister akhila priya came down heavily on silpa brothers

నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ రెచ్చిపోతోంది. ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డిపై తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది. గుంటూరు పర్యటనలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఉపఎన్నిక ఓటమితోనే శిల్పా బ్రదర్స్ నంద్యాల వదిలి పారిపోయారట. నంద్యాల ప్రజలు శిల్పా మోహన్ రెడ్డికి గట్టి బుద్ది చెప్పారని అన్నారు. కేసుకు భయపడే మాజీ ఎంఎల్సీ చక్రపాణిరెడ్డి పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నట్లు ఎద్దేవా చేసారు. శిల్పా సోదరులిద్దరూ మొన్నటి ఎన్నిక ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి జనాలకు కనిపించటమే లేదన్నారు. మాటకు కట్టుబడి ఉండే వారైతే వెంటనే శిల్పా బ్రదర్స్ రాజకీయా సన్యాసం తీసుకోవాలని సవాలు విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios