Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని 4 రోజులుగా మెకానిక్‌ నిర్భంధం

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకొంది. మెకానిక్ కార్తీక్ కారును తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారనే నెపంతో   నాలుగు రోజులుగా షోరూమ్‌లోనే నిర్భంధించారు. ఈ విషయమై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

mechanic kartik torturched by car showroom manager in Chittoor district lns
Author
Chittoor, First Published Jul 18, 2021, 5:06 PM IST


చిత్తూరు: షోరూం నుండి  కారును తీసుకెళ్లి యాక్సిడెంట్  చేశాడనే నెపంతో  మెకానిక్ కార్తీక్‌‌ను  మేనేజర్‌ నిర్భంధించాడు. ఈ విషయమై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో చోటు చేసుకొంది.ఓ కారు షోరూం లో కార్తీక్  మెకానిక్ గా పనిచేస్తున్నాడు.  మేనేజర్ కు తెలియకుండానే  కార్తీక్ కారును తీసుకెళ్లాడు.  అయితే కారును తీసుకెళ్లి  యాక్సిడెంట్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న షోరూమ్ మేనేజర్ కార్తీక్ ను నాలుగు రోజులుగా షోరూమ్ లోనే బంధించాడు.

ఈ విషయం తెలుసుకొన్న దళిత సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.కార్తీక్  కారును ఎందుకు షోరూం నుండి తీసుకెళ్లారు,  యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, నాలుగు రోజులుగా  కార్తీక్ ను ఎందుకు  నిర్భందించారనే విషయమై పోలీసులు ఈ దర్యాప్తులో తేల్చనున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కార్తీక్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios