Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రి నిర్లక్ష్యం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుటే వివాహిత మృతి... !

అమరావతి : అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గుంటుపల్లి భారతి(30) అనే వివాహిత మృతి చెందింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఎదుటే తుదిశ్వాస విడిచింది.

married woman died in front of the primary health center at amrutaluru - bsb
Author
Hyderabad, First Published Apr 17, 2021, 12:51 PM IST

అమరావతి : అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గుంటుపల్లి భారతి(30) అనే వివాహిత మృతి చెందింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఎదుటే తుదిశ్వాస విడిచింది.

ఈ రోజు తెల్లవారుజామునుండి చికిత్స కోసం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. 8 గంటలకు 108 వాహనం వచ్చింది. అందులోని సిబ్బంది భారతిని పరీక్షించి మరణించినట్లు నిర్దారణ చేశారు. 

అయితే భారతి కరోనాతో మృతి చెందిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి ఇప్పటివరకు పి.హెచ్.సి.ఎదుటే  మృతదేహం ఉంది. 

విషయం తెలిసినా అధికారులు ఏ మాత్రం స్పందించలేదు. తెల్లవారుజామున వచ్చినా పట్టించుకోకపోవడంతోనే తన కూతురు మృతి చెందిందని తల్లి రోదిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios