సత్యసాయి ప్రశాంతి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లిలో మొహర్రం వేడుకలు జరిగాయి. అయితే నిప్పుల గుండంలో ప్రమాదవశాత్తూ పడి ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు

సత్యసాయి ప్రశాంతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లిలో మొహర్రం వేడుకలు జరిగాయి. అగ్నిగుండంలో ప్రమాదవశాత్తూ జారిపడి నర్సింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింహులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred