సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీని మోసం చేసే యత్నం.. చివరకు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ పేరుతో మోసానికి యత్నించాడు ఓ వ్యక్తి. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి ఎండీకి కాల్ చేయడమే కాకుండా.. ఫేక్ మెసేజ్ పంపాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ పేరుతో మోసానికి యత్నించాడు ఓ వ్యక్తి. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి ఎండీకి కాల్ చేయడమే కాకుండా.. ఫేక్ మెసేజ్ పంపాడు. ఓ క్రికెటర్కి ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కిట్లు స్పాన్సర్ చేయాలని.. వాటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పాడు. కిట్పై మణిపాల్ చిహ్నాన్ని వాడుకుంటామని తెలిపాడు. తాను సీఎం పీఏ అని చెప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన మణిపాల్ ఆస్పత్రి ఎండీ.. ఆ మెసేజ్ ఎంతవరకు వాస్తవమో పరిశీలించాలని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి సూచించారు.
ఈ క్రమంలోనే అది ఫేక్ మెసేజ్ అని తెలియడం మణిపాల్ ఆస్పత్రి యజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొబైల్ నెంబర్, ఇతర సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు పాత నేరస్తుడేనని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా అతడు పలువురిని మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.