రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బాషా బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. 20 రోజుల క్రితం కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన షేక్ బాషా.. కరోనానుంచి కోలుకున్నారు.
రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బాషా బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. 20 రోజుల క్రితం కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన షేక్ బాషా.. కరోనానుంచి కోలుకున్నారు.
ఆ తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఒంగోలుకు.. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యలు చెప్పారు.
అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. బాషా మృతితో ప్రకాశం జిల్లాలో బ్లాక ఫంగస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది.
కాగా, కరోనా నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కబళిస్తుండటం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ వల్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యే సమయానికే ఆయన కన్ను బాగా వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది.
విశాఖ కేజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కలకలం...! 35యేళ్ల మహిళలో గుర్తింపు..!!...
దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. వీటిని బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ ఫంగస్ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రాష్ట్రంలో ఎక్కడైనా నమోదయ్యాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1600 వాయల్స్ను వాటాగా కేటాయించగా, వాటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
