Asianet News TeluguAsianet News Telugu

అత్తమీద కత్తితో దాడి చేసి.. చెవి కోసిన అల్లుడు.. అడ్డొచ్చిన భార్యను....

నిత్యం తాగి వచ్చి భర్త డబ్బుల కోసం వేధించడాన్ని భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు నరేష్. దీంతో కోపంతో.. ఊగిపోతూ అత్తింటికి వెళ్లి అత్త మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది.
 

man attacked on mother in law and cut the ear in kurnool
Author
Hyderabad, First Published Jan 12, 2022, 2:11 PM IST

కర్నూలు : తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి mother-in-law మీద కత్తితో దాడి చేసి Ear కోసేశాడు. అడ్డు వచ్చిన wifeనూ గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం 
Adoniలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠాగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి marriage చేసుకున్నారు. 

కొద్దికాలం తర్వాత అతని అసలు స్వరూపం బయటపడింది. నరేష్ కుమార్ Drinkకు బానిస అని తేలింది. అంతేకాదు నిత్యం తాగి వచ్చి భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. ఇది భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 
దీంతో కోపంతో.. తాగి.. నరేష్ కుమార్ అత్త ఇంటికెళ్లాడు. కోపంతో ఊగిపోతూ knifeతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది.

అడ్డు వచ్చిన భార్య మీద మీద కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్ కుమార్ అక్కడినుంచి తప్పించుకుని పరారయ్యాడు. జరిగిన ఘటన మీద మాధవి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే నరేష్ కుమార్ మీద భార్య ఆరోపిస్తూ.. నరేష్ తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాక వివాహ సమయంలో తమ దగ్గర రూ.8 లక్షలు నగదు, 20 తులాల బంగారం కట్నంగా తీసుకున్నారని తెలిపింది. ఆ మొత్తాన్ని నరేష్ తాగుడుకు ఖర్చు చేసేశాడని... మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం రోజూ వేధిస్తున్నాడని మాధవి విలపించింది. 

కాగా, గతంలో కూడా అత్తమీద అల్లుడు దాడికి దిగిన ఘటనలు జరిగాయి. భూపాల్‌పల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామంలో అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. తల్లీకూతుళ్లపై అల్లుడు గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్త అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. అల్లె ప్రభాకర్‌కు అదే గ్రామానికి చెందిన సుజాతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే మద్యానికి బానిసైన ప్రభాకర్ భార్యపై అనుమానంతో తరచు ఆమెను వేధిస్తుండేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక సుజాత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను బ్రతిమలాడి ఇంటికి తీసుకొద్దామని ప్రభాకర్ మంగళవారం రాత్రి అత్తారింటికి వెళ్లాడు.

ఈ క్రమంలో ఇంటికి వచ్చే విషయమై భార్య, భర్తల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ప్రభాకర్ భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. కుమార్తెను కాపాడుకోవడానికి వెళ్లిన అత్త లక్ష్మీపైనా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. వీరి గొడవను గమనించిన స్థానికులు సుజాతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios