గన్నవరం ఎయిర్పోర్టు: తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనేవున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనేవున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులున్నారు.
వారిలో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.