Asianet News TeluguAsianet News Telugu

ఏలూరు జిల్లాలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

Lightning strike kills 4 in Eluru District
Author
First Published Aug 17, 2022, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బోగోలులో జామాయిల్ తోట నరికేందుకు దాదాపు 30 మంది కూలీలు వచ్చారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios