Asianet News TeluguAsianet News Telugu

ఏపీ హైకోర్టు తరలింపు ప్రచారం: అమరావతిలో న్యాయవాదుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలంటూ హైకోర్టు ప్రాంగణం వద్ద సోమవారం ఏపీ హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. హైకోర్టు తరలింపు వార్తలపై తమకు స్పష్టతనివ్వాలంటూ వారు నినాదాలు చేశారు

lawyers protest in amaravathi over ap govt may shift high court from Amaravathi to kurnool
Author
Amaravathi, First Published Sep 23, 2019, 3:40 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలంటూ హైకోర్టు ప్రాంగణం వద్ద సోమవారం ఏపీ హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు.

హైకోర్టు తరలింపు వార్తలపై తమకు స్పష్టతనివ్వాలంటూ వారు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా హైకోర్టును కర్నూలుకు తరలించే దిశగా తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో కలకలం రేగింది.

ఆ వెంటనే నేలపాడులోనే ఏపీ హైకోర్టును కొనసాగించాలంటూ పశ్చిమగోదావరి నుంచి నెల్లూరు వరకు గల బార్ ఫెడరేషన్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం గవర్నర్‌కు విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios