రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు: నేడు పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ టీమ్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ అధికారులు బుధవారం నాడు పరిశీలించనున్నారు. ఎన్జీటీ ఆధేశాల మేరకు కేఆర్ఎంబీ అధికారులు పరిశీలించనున్నారు.
హైదరాబాద్:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ అధికారుల బృందం బుధవారం నాడు పరిశీలించనున్నారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం చాలా కాలంగా వాయిదా పడుతుంది. ఇవాళ ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తామని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది.
ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం నోడల్ అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది.అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం నుండి కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం రాలేదు. కేఆర్ఎంబీ అధికారులతో కర్నూల్ నీటిపారుదల శాఖ సీఈ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంధ సంస్థ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేఆర్ఎంబీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.