ప్రముఖ కమ్యూనిస్ట్ యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున విశాఖపట్నంలోని తన మనవరాలి ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ కమ్యూనిస్ట్ యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున విశాఖపట్నంలోని తన మనవరాలి ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం కోటేశ్వరమ్మ కోరిక మేరకు ఆమె పార్థివదేహాన్ని వైద్య పరీక్షల కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్‌‌కు అప్పగిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కోటేశ్వరమ్మ గత నెల 5న 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.