ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
కృష్ణాజిల్లా : మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతిపరుల షాపులను అధికారులు తొలగిస్తున్నారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
"
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల పక్షాన నిలిచారు. ఘటనాస్థలిలోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...అక్రమాలు తొలగిస్తే న్యాయంగా అందరివి తొలగించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపులు తొలగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
