Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ పోలీసులకు చిక్కిన కిల్లర్స్ గ్యాంగ్: వెలుగులోకి విస్తుపోయే విషయాలు

వరుస హత్యలకు, చోరీలకు, చైన స్నాచింగులకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

Killers gang nabbed by Vijayawada police
Author
Vijayawada, First Published Jun 19, 2021, 9:15 AM IST

విజయవాడ: ఓ హంతక ముఠాను విజయవాడ బోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస హత్యలకు, చోరీలకు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కారు. ప్రస్తుతం వారు విజయవాడ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు. 

ఆ హంతక ముఠాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ముఠా ఐదు హత్యలకు, 10 చైన్ స్నాచింగ్ లకు, ఐదు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎటీఎంను చోరీ చేయడానికి ముఠా ప్రయత్నించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. 

వారిని విచారించే క్రమంలో ఇతర నేరాలు కూడా బయటపడ్డాయి. పెనమలూరులో వృద్ధురాలిని హత్య చేసి ఆ ముఠా నగలతో ఉడాయించినట్లు తేలింది. కంచికచర్లలో కూడా ఓ వృద్ధ దంపతులను ఈ ముఠా హత్య చేసినట్లు గుర్తించారు. 

ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా ఎంచుకుని ఆ ముఠా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios