Asianet News TeluguAsianet News Telugu

జడ్జిమెంట్ డే: మరికాసేపట్లో సూరి హత్య కేసులో తీర్పు

తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన మద్దెల చెర్వు సూరి హత్య కేసు తీర్పు తుది దశకు చేరుకుంది. ఏడేళ్ల క్రితం జరిగిన మద్దెలచెర్వు  సూరి హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పును ఇవ్వనుంది. 

judgement day: maddela chevu suri murder case in nampally court
Author
Hyderabad, First Published Dec 18, 2018, 11:35 AM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన మద్దెల చెర్వు సూరి హత్య కేసు తీర్పు తుది దశకు చేరుకుంది. ఏడేళ్ల క్రితం జరిగిన మద్దెలచెర్వు  సూరి హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పును ఇవ్వనుంది. 

2011 జనవరి 3న హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ సమీపంలోని నవోదయ కాలనీలో మద్దెల  చెర్వు  సూరి హత్య జరిగింది. ఈ హత్య సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణే పాయింట్ బ్లాంక్ లో మద్దెల చెరువు సూరిని హత్య చేశారడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సూరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

అయితే హత్య జరిగిన అనంతరం భానుకిరణ్ పరారయ్యాడు. ఆ తర్వాత 2012 ఏప్రిల్ 12న అంటే దాదాపు 14 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు భానుకిరణ్. మెుదట సూరి హత్య కేసును నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ తర్వాత కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. 

సీసీఎస్ నుంచి కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సిఐడీ విచారణకు వెళ్ళడంతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీఐడీ దాదాపు 90 మంది సాక్షులను విచారించారు. విచారణ అనంతరం మద్దెలచెర్వు సూరిని అనుచరుడు భానుకిరణ్ పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపాడని సిఐడీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది. 

ఈ కేసులో సూరి డ్రైవర్ మధు మోహన్ సాక్ష్యమే కీలకంగా మారింది. తాము జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వెళ్తూ మార్గ మధ్యలో ఒక లాయర్ ను కలిశామని అక్కడ నుంచి స్కోడా కారులో సూరి, తాను, భాను కిరణ్ కలిసి బయలు దేరినట్లు పోలీసుల వాంగ్మూలంలో చెప్పాడు. తాను డ్రైవింగ్ చేస్తుండగా తన పక్కన మద్దెలచెర్వు సూరి కూర్చున్నాడని వెనుక మాత్రం భానుకిరణ్ కూర్చున్నట్లు సిఐడీ అధికారులకు తెలిపాడు. 

జూబ్లీహిల్స్ సమీపంలోని నవోదయ కాలనీకి చేరుకుంటుండగా ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో కారును స్లో చెయ్యగా ఒక్కసారిగా కారులో  పెద్ద శబ్ధం వచ్చిందని తీరా చూస్తే సూరి సిగరెట్ కాలుస్తూ తన భుజాలపై వాలిపోయాడని అయితే ఆ సమయంలో భాను కిరణ్ అటాక్ అటాక్ అంటూ అరుస్తూ కారు దిగి పారిపోయాడని వాంగ్మూలంలో తెలిపాడు మధుమోహన్. 

 అయితే వెంటనే రక్తపు మడుగులో ఉన్న సూరిని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. హత్య అనంతరం తాను ఎన్నిసార్లు భానుకిరణ్ కు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపాడు. సూరిపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపినట్లు ఫోరెన్సిక్ నివేదిక కూడా తేల్చింది. అయితే ఇంతలా పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసే అవకాశం ఒక్క భాను కిరణ్ కు మాత్రమే ఉందని సీఐడీ ఆరోపిస్తోంది. 

ఇకపోతే 14 నెలల అనంతరం పోలీసులకు దొరికిన భాను కిరణ్ కనీసం బెయిల్ కు కూడా ప్రయత్నించలేదు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. విచారణకు మాత్రం కోర్టుకు హాజరవుతున్నాడు. 

అయితే ఈ కేసులో భానుకిరణ్ నిందితుడా కాదా అన్నది మరికొద్ది గంటల్లో నాంపల్లి స్పెషల్ కోర్టు స్పష్టం చెయ్యనుంది. ఏడేళ్ల తర్వాత తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

Follow Us:
Download App:
  • android
  • ios