Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం: పీఆర్సీపై తేలేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారులు ఇవాళ సమావేశమయ్యారు.జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.తత ఈ సమావేశంలోనైనా పీఆర్సీ సహా పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

Joint staff Council meeting  begins at secretariat
Author
Guntur, First Published Dec 3, 2021, 4:20 PM IST


అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం  శుక్రవారం నాడుత మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఏపీ సీఎం ys Jagan ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. Prc కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా  ఎదురు చూస్తున్నారు. పీఆర్సీపై ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇచ్చి ఏడాది దాటుతుంది. ఈ నివేదికను ఇంకా ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం అందించలేదు. 

పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా  ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత నెల 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇవ్వలేదు.ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై  ఐఆర్ 27 శాతానికి పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్దంగా లేవు. వేతన ఫిట్ మెంట్ పై కూడా కనీసం 60 శాతంగా ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి నెలకొంది.

ఉద్యోగుల సమస్యలపై సంప్రదింపులకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఏడాది అక్టోబర్ 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. అయితే వారంలో పీఆర్సీ నివేదికను విడుదల చేస్తామని సీఎస్ సమీర్ శర్మ హమీ ఇచ్చారు. అయితే ఇంతవరకు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందించలేదు. ఇవాళ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ అంశాన్ని సెటిల్‌ చేయాలని Employees Union నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగులకు, రిటైర్డ్‌ సిబ్బందికి రావలసిన కోట్లాది రూపాయలు పెండింగ్‌ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ తేదీకి ఒక్క రోజు తక్కువైనా అంగీకరించమన్నారు. 55 పర్సంటేజీ ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.  పీఆర్సీ విషయమై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. 

ఇటీవలనే సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసు ఇచ్చారు.  నెల రోజులుగా పీఆర్సీ  విషయాన్ని తేల్చాలని  ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా కూడా స్పష్టత రాని కారణంగానే ఆందోళనకు సిద్దమైనట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఈ నెల 7 నుంచి తమ ఉద్యమం ప్రారంభం అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. 
అయితే ఇవాళ తిరుపతిలో సీఎం జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios