వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంత కసి పేరుకుపోయిందో ఒక్కసారిగా బయటపడింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంత కసి పేరుకుపోయిందో ఒక్కసారిగా బయటపడింది. వైఎస్సార్ లాగ పరిపాలించి మంచోడనే పేరు తెచ్చుకోవాలని ఉందని ప్రకటించారు. సోమవారం ఉదయం ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైన తర్వాత ఇడుపులపాయలోనే బహిరంగసభ జరిగింది. ఆ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావించారు. అదే సందర్భంలోనే రాష్ట్రానికి సంబంధించి తనలో ఎంత కసి పేరుకుపోయిందో కూడా జగనే వెల్లడించారు. దాంతో జగన్లో ఇంత కసి ఉందా అంటూ విన్నవారందరూ ఆశ్చర్యపోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ జగన్ కు ఏ ఏ అంశాల్లో కసి పేరుకుపోయిందో...ఆయన మాటల్లోనే.

1- ఎప్ప‌టికీ ప్ర‌తి పేద గుండెలో శాస్వతంగా నిలిచిపోవాలన్న క‌సుందట

2- ఏపీ కోసం ప్రత్యేకహోదా సాధించాలన్న కసి

3- రైతుల‌కు మేలు చేయాల‌న్న క‌సి పెంచుకున్నారట

4- అవినీతి ఏపిని అభివృద్ధి ఆంధ్రాగా మార్చాలని

5- అవినీతిపరులను జైల్లో పెట్టాలన్న కసి

6- పేదలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చూడాలన్న కసి

7- చదువుల విప్లవం తేవాలన్న కసి

8-ప్రత్యేకహోదా సాధించి ప్రతీ నిరోద్యగికి ఉద్యోగం ఇవ్వాలన్న కసి

9- మాఫియా ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలెంచేయాలన్న కసి.